ఫేక్ వార్తలను ఖండించిన ఈటల.. వాళ్లే చేశారని మండిపాటు

-

కరీంనగర్: సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేక్ వార్తలను ఈటల రాజేందర్ ఖండించారు. టీఆరెస్‌ఐటీ విభాగం వాళ్లు చిల్లర పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో తనును ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు.

త్వరలో జరగబోయే హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా తన గురించి తెలుసుకోవాలని సూచించారు. తనపై అబండాలు వేసినంత మాత్రానా హుజూరాబాద్ నియోజకర్గ ప్రజలు నమ్మనన్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఎన్ని చేసినా హుజురాబాద్‌లో గెలుపు తమదేనని ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు. .

ఇక టీఆర్ఎస్‌లో ఈటల ఎపిసోడ్ తెలిసిందే. ప్రస్తుతం ఆయన బీజేపీ నేతగా ఉన్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికే ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. దీంతో ఆయన హుజురాబాద్ ప్రజానీకాన్ని కలుస్తారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఈటలపై దుష్ర్పచారానికి తెరలేపారని బీజేపీ నేతలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version