”మీలో ఎవరు కోటీశ్వరుడు” కొత్త ప్రోమో వైరల్.. అదరగొట్టిన ఎన్టీఆర్

-

”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బాగా ఇష్ట పడతారు. అయితే…. ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షోకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ రియాలిటీ సో కరోనా మహమ్మారి కారణంగా చాలా ఆలస్యం అయింది. కరోనా మహమ్మారి లేకపోతే… ఈ పాటికీ టీవీల్లో ఈ షో టెలికాస్ట్‌ అయ్యేది.

ఇక ఇటీవలే ఈ షోకు సంబంధించిన ఓ అదిరిపోయే ప్రోమో వీడియోను రిలీజ్‌ చేసింది జెమినీ టీవీ యాజమాన్యం. ఈ ప్రోమో రిలీజ్‌ అయి వారం తిరగముందే మరో ప్రోమోను రిలీజ్‌ చేసింది జెమినీ టీవీ యాజమాన్యం. ఇక ఈ ప్రోమోలో ఎన్టీఆర్‌ తన డైలాగులతో మరోసారి అదరగొట్టాడు. మనీతో పాటు మనుసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్క కథ మీది.. కళ మీది .. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎమరు మీలో కోటీశ్వరులు ” అంటూ ఎన్టీఆర్‌ తన స్టైల్‌ లో డైలాగులు పేల్చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version