దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకాకు అనుమతి: ఐదుకు పెరిగిన టీకాలు

-

దేశంలో మరో కొవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ ( johnson And johnson vaccine ) సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ శనివారం ట్విట్టర్‌లో తెలిపారు.

johnson and johnson vaccine | జాన్సన్ అండ్ జాన్సన్

భారత్‌లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దేశంలో అత్యవసర వినియోగం కోసం జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. దీంతో మొత్తం 5 వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి లభించింది. ఇది కొవిడ్-19 వ్యతిరేక పోరులో భారత్ సమర్థవంతంగా నిలవడానికి దోహదపడుతుంది అని ఆరోగ్య మంత్రి ట్వీట్‌లో తెలిపారు. న్యూ జెర్సీ లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ చిన్న పిల్లల సబ్బుల తయారీ సంస్థ గా మనందరికీ తెలుసు. ఈ సంస్థ అధిపతి స్టాఫెల్స్.

దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు అత్యవసర వినియోగం కోసం ఈ నెల 5న దరఖాస్తు చేసుకున్నట్లు ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.

కరోనా వైర‌స్‌ ఎదుర్కోవడంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌తో 85శాతం సమర్థతను కలిగి ఉన్నది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల త‌ర్వాత ఆ టీకా ప్ర‌భావం అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు.

దేశంలో అందుబాటులోకి ఐదు వ్యాక్సిన్లు
జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసుకు అత్యవసర అనుమతి లభించడంతో దేశంలో మొత్తం ఐదు డోసులకు అనుమతి లభించినట్లు అయింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ స్వదేశీ తయారీ టీకా కోవాగ్జిన్‌, సీరం కొవిషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ -వి, అమెరికాకు చెందిన మెడర్నా టీకాలకు ఇప్పటికే అత్యవసర అనుమతి లభించింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఐదో టీకా. దేశంలో గురువారం నాటికి 50 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version