Breaking : మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా

-

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మృతి చెందడం మరియు ముగ్గురు తీవ్రంగా గాయపడి బళ్లారి ఆసుపత్రిలో చేరడం చాలా బాధాకరం,ఈ సంఘటన మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.

మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని, తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతుల కుటుంబాలను అందరినీ అన్ని విధాల ఆదుకుంటామని వారు ధైర్యంగా ఉండాలని, జరిగిన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ప్రసాదించాలని, అదేవిధంగా మృతుల ఆత్మకు శాంతి కలగాలని దుఃఖంతో దేవుని ప్రార్థిస్తున్నానని రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version