ఏపీలో పదో తరగతి పరీక్షలు యధాతథం కానీ తెలంగాణలో ?

-

CBSE 10వ తరగతి పరీక్షలు రద్దు, 12 వ తరగతి పరీక్షలు వాయిదా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల 10th, ఇంటర్ పరీక్షల పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయి అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామని, ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని అన్నారు.

అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్న అయన విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. ముందు రోజుల్లో ఒక వేళ కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని అన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రేపు ఇంటర్, పాఠశాల విద్యాశాఖ అధికారులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ పై సమీక్ష జరిపి సీఎంకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీనిని బట్టి ఒకటి రెండు రోజుల్లో పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news