పెట్రోల్ ట్యాంక‌ర్‌కు వెల్డింగ్ చేస్తుండ‌గా పేలుడు.. ఇద్ద‌రు మృతి

-

పెట్రోల్ ట్యాంక‌ర్ గా వెల్డింగ్ చేస్తుండ‌గా పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. ఈ విషాదాక‌ర ఘ‌ట‌న సూర్యా పేట్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కాగ ఖాళీ పెట్రోల్ ట్యాంక‌ర్ లీక్ అవుతుంద‌ని సూర్యా పేట్ లోని కొత్త బ‌స్టాండ్ ద‌గ్గ‌ర్లో గ‌ల ఒక వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ చేయ‌డానికి తీసుకువ‌చ్చారు. ఖాళీ పెట్రోల్ ట్యాంక‌ర్ కు లీక్ ఆయ‌న ప్రాంతంలో వెల్డింగ్ చేస్తుండ‌గా.. పేలుడు సంభవించింది.

దీంతో వెల్డింగ్ వ‌ర్క‌ర్ అర్జున్ (36), ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ గ‌ట్టు అర్జున్ (52) అక్క‌డికక్క‌డే మృతి చెందారు. అలాగే మ‌రో వెల్డింగ్ వ‌ర్కర్ మ‌ల్ల‌య్య‌, ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో మ‌ల్ల‌య్య ప‌రిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభ‌వించ‌డంతో పెట్రోల్ ట్యాంక‌ర్ తుక్కు తుక్కు అయింది. అలాగే చుట్టు ఉన్న నాలుగు దుకాణాల అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగ వెల్డింగ్ చేసే స‌మ‌యంలో పెట్రోల్ ట్యాంకర్ ఖాళీగానే ఉంది. అయినా పేలుడు అందుకు సంభ‌వించిందో అని పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news