సికింద్రాబాద్‌లొ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపైకి చెప్పులు, కుర్చీలు!

-

సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తలకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.అనంతరం ఆందోళనకారులు పోలీసులపైకి చెప్పులు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులతో ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం పెరిగింది. చేసేదేమీ లేక పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

ఇటీవల సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వర్గానికి చెందిన సలీం అనే వ్యక్తి కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన హిందువులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసింది ముంబయికి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version