ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మామునూరులో కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర పోర్టు కింద భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు.
ఎయిర్ పోర్టు కింద కోల్పోయిన భూములకు పరిహారంగా డబ్బులు కాకుండా భూములే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే నిర్వహిస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమకు ముందు భూ పరిహారం ఇప్పించాకే పనులు ప్రారంభించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
వరంగల్ లో ఉద్రిక్తత.. అధికారులను అడ్డుకున్న మామునూరు రైతులు
ఎయిర్ పోర్టు కోసం భూముల సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు
భూమికి భూమి పరిహరంగా ఇవ్వాలని రైతుల డిమాండ్@HiWarangal @TriCityWarangal #Telangana #Hyderabad #BRS #KTR #Congress #RevanthReddy #BJP #Warangal pic.twitter.com/75iu6eI4Rn
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 4, 2025
వరంగల్ – మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు
ఎకరానికి రూ.5 కోట్లు ఇస్తేనే భూములు ఇస్తాం
మంత్రి కొండా సురేఖది ఒక మాట.. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట
మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది.. రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి… pic.twitter.com/xXiX1IBl3s
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025