వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారని ప్రచారం.. తప్పు పట్టిన అస్సాం పోలీస్..

-

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో తప్పుడు వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ప్రపంచమంతా వ్యాక్సినేషన్ విషయంలో వేగంగా ఉండి, అందరికీ వ్యాక్సిన్ వేయాలని చూస్తుంటే సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఫ్రెంచ్ నోబెల్ లారెట్, వ్యాక్సిన్ పై మాట్లాడినట్లు వచ్చిన వార్తలు వైరల్ అవుతున్నాయి. వ్యాక్సినేషన్ వేసుకున్న అందరూ రెండేళ్ళలో చచ్చిపోతారని ఆ వార్తల సారాంశం.

ఏదో ఒకలాగా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ చనిపోతారని ఫ్రెంఛ్ నోబెల్ లారెట్ చెప్పినట్లు ఒక వార్త ట్విట్టర్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయమై అస్సాం పోలీస్ స్పందించింది. ఇలాంటి తప్పుడు వార్తలు షేర్ చేయవద్దంటూ, ప్రజలని మరింత భయాందోళనకి గురి చేయవద్దంటూ, ఇలాంటివి షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని అస్సాం పోలీస్ ట్వీట్ చేసింది. ఈ విషయమై చర్య తీసుకోవాలని నెటిజన్లు స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version