ప్రముఖ గేయ రచయిత “దేవ్ కోహ్లీ” కన్నుమూత

-

బాలీవుడ్ లో ఈ రోజు ఒక విషాద వార్త సినీ ప్రముఖులను మరియు అభిమానులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో ప్రముఖ గేయ రచయితగా ఉన్న దేవ్ కోహ్లీ ఈ రోజు ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఈ మరణానికి సంబంధించిన కారణాలు ఏమీ ఇంకా తెలియరాలేదు.. ఇప్పటికి అతని వయసు 80 సంవత్సరాలు కావడంతో అనారోగ్యం కారణంగానే మరణించి ఉంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈయన మైనే ప్యార్ కియా, బాజీగర్, జుద్వా 2, ముసాఫిర్, టాక్సీ వంటి చాలా సినిమాలకు పాటలు రాశారు దేవ్ కోహ్లీ. ఇతని కెరీర్ లో దాదాపుగా 100 చిత్రాలకు పాటలు రచించినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న అను మాలిక్, ఆనంద్ మిలింద్ మరియు రామ్ లక్ష్మణ్ లాంటి సంగీత దర్శకులతో కలిసి ఎన్నో అద్భుతమైన కంపొజిషన్స్ చేశారు.

దేవ్ కోహ్లీ మృతికి బాలీవుడ్ ప్రముఖులు మరియు సన్నిహితుల నుండి సంతాపాలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version