క‌నిపించ‌ని వైసీపీ ఎమ్మెల్యే.. పోలీసుల‌కు ఫిర్యాదు..

-

మంగళగిరి ఎమ్యేల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనుబడటంలేదంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రైతులు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోననని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన అనంతరం రాజధాని రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళన జరుగుతున్న నాటి నుంచి ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని రైతులు చెబుతున్నారు. ఆ క్ర‌మంలో.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్‌లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు.

రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదు. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము.. అంటూ వాళ్లు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మ‌రి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news