ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఆర్టీసీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన జిల్లాలోని వంకాయ గూడెం శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వంకాయ గూడెం గ్రామ శివారులో ఓ డ్రైవర్ లారీని నిలిపి టైర్లలో గాలిని పరిశీలిస్తున్నాడు.
ఈ క్రమంలోనే కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన టీజీఎస్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పాక్షికంగా ధ్వంసం కాగా, బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.