కేంద్ర బృందం ముందు తన్నుకున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు

-

ఒక్కోసారి మన నేతలు చేసే పనులు అర్ధం పర్ధం లేకుండా ఉంటాయి. ఈరోజు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అదేమంటే ఈరోజు నల్లగొండ చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో కేంద్ర బృందం పర్యటనకు వచ్చింది. ఈ సమయంలో వారి ముందే తన్నుకున్నారు బీజేపీ – టీఆర్ఎస్ కు చెందిన నాయకులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఈ కేంద్ర బృందం. పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.

అయితే వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బృందానికి చెప్పారు బీజేపీ నాయకులు. అలా చెబుతున్న క్రమంలో వారిని టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు తన్నుకున్నే దాకా రావడంతో అక్కడే ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version