బ్రేకింగ్‌: జ‌ల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం.. 9మంది గల్లంతు

-

తెలంగాణ‌లోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ భూగ‌ర్భ‌ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 10:30గంట‌ల స‌మ‌యంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు అలుముకోవ‌డంతో సిబ్బంది భ‌యంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘ‌ట‌న జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 16 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంకా సొరంగ మార్గంలోనే తొమ్మిది మంది మంట‌ల్లో చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.


ఫైల్ ఫొటో

డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్,మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్‌, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయిన‌ట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మంట‌ల్లో చిక్కుకున్న సిబ్బందిని కాపాడేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కారణంగానే ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news