ఫస్ట్ నాచురల్ తేనె సేకరణ యూనిట్‌.. స్వచ్ఛతకు మారుపేరు గిరి హనీ

-

ఈ రోజుల్లో తేనె వాడమని అందరూ చెప్తున్నారు.. కానీ మార్కెట్ లో ప్యూర్ హనీ దొరకడం కష్టం. సో కాల్డ్ కంపెనీలు ప్యూర్ అని చెప్తున్నప్పటకీ.. అవి కల్తీ అయినవే అని అందరిమాట.. స్వచ్ఛమైన తేనేకు పెట్టింది పేరు ఆదివాసీల‌ ఖిల్లా ఆదిలాబాద్ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (CSE )రిపోర్ట్ లు చెపుతుంటే కేవలం ఒకే ఒక్క తేనె మాత్రం అందరిని నమ్మకాన్ని పెంచుకుంటుంది.

టీఎస్‌జీసీసీ(TSGCC) ఆద్వర్యంలో కొనసాగుతున్న గిరితేనె‌. నిర్మల్లో కొనసాగుతున్న ఈ గిరితేనె యూనిట్ తెలంగాణలోని తొలి సహజ తేనె సేకరణ యూనిట్‌. ఈ యూనిట్ లో రోజుకు 300 లీటర్ల సామర్థ్యంతో తేనె సేకరణ కొనసాగుతోంది. అడవుల నుండి ఆదిమ గిరిజనులు సేకరించిన స్వచ్చమైన పుట్ట తేనె ఉట్నూర్ , నార్నూర్‌ , ఇంద్రవెళ్లి , భద్రాద్రి కొత్తగూడెంలో ఈ యూనిట్ కి చేరుతోంది. ఈ తేనెలో పుష్కలమైన ఔషధ విలువలతో పాటు ఆయుర్వేద లక్షణాలు ఉండటంతో మాంచి డిమాండ్ ఉంది. ఈ గిరిహనీ అగ్‌మార్క్ నుండి స్పెషల్ గ్రేడ్ తో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణను సైతం పొందింది.

నిర్మల్ గిరిహనీ యూనిట్ లో ప్రాసెస్ చేసిన ఈ తేనెను ప్లాస్టిక్ సీసాలలో ప్యాక్ చేసి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. స్వచ్ఛమైన తేనెను హోల్‌సేల్ డీలర్లకు కిలో 250 రూపాయలకు విక్రయిస్తుండగా, రిటైల్ అవుట్‌లెట్లలో కిలోకు రూ. 360కి విక్రయిస్తుంటారు.. యాత్రా స్థలాల్లోను ఈ గిరి తేనె స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. మరో వైపు వినియోగ‌దారుల గుమ్మం ‌వ‌ద్ద‌కే స్వ‌చ్ఛ‌మైన గిరి తేనెను అందించేందుకు టీఎస్‌జీసీసీ ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నిన్న మొన్నటి వరకు దేశానికే పరిమితం అయిన ఆదివాసీల గిరి హనీ.. ఇప్పుడు విదేశాలకు సైతం వ్యాపిస్తోంది.

తెలంగాణలోని హైదరాబాద్‌ గిరి బజార్‌ తో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు ఔట్‌లెట్లలో ఈ గిరితేనె అందించేందుకు సమాయత్తం చేస్తున్నారు. దీంతో వేలాది మంది గిరిజనులకు ఈ తేనె ద్వారా ఉపాధి కలుగుతోంది.

గిరి తేనెలో ఉండో పోషకాలు:

ఈ స్వచ్చమైన తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజ లవణాలతో పాటు.. థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్…లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనో ఆమ్లాలూ ఎంజైములూ పుష్కలంగా ఉన్నాయి. గిరి హనీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సైతం చెప్తున్నారు. ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయని చెపుతున్నారు. ఈ గిరి తేనెను రోజు తీసుకుంటే ఆరోగ్యపరంగా మరెన్నో లాభాలుంటాయని నిపుణుల మాట.

ఇంకెందుకు ఆలస్యం తేనె అనుకుని కల్తీవి తిని ఆరోగ్యం పాడుచేసుకునే బదులు.. ఇంత మంచి స్వచ్ఛమైన గిరిహనీ వాడుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version