తిరుపతి లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఐదుగురు మృతి

-

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా… ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా శ్రీవారి సన్నిధి తిరుపతి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో… వచ్చి ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీకొట్టడంతో నే… ఆ కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ విషాద ఘటన లో ఏకంగా ఐదుగురు మరణించారు. మరణించిన వారిలో ఓ చిన్నారి ఉండడం గమనార్హం. ఇక ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం అందుతోంది. ఇక క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. డ్రైవర్ అతి వేగంగా కారు నడపడం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version