BREAKING : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు పూర్తి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కాసేపటి క్రితమే అధికార లాంఛనాలతో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో… రోశయ్య పార్థివదేహాన్ని గాంధీ భవన్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీ నేతలు అలాగే ఆయన అభిమానులు గాంధీభవన్ లో  రోశయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి.. సంతాపం వ్యక్తం చేశారు.

అనంతరం 12 గంటల సమయంలో గాంధీభవన్ నుంచి… మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థివదేహాన్ని కొంపల్లి లోని ఆయన ఫామ్ హౌస్ కి తీసుకువచ్చారు. ఇక అంతక్రియలు లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కాసేపటి క్రితమే అధికార లాంఛనాలతో కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version