Breaking : రాహుల్ యాత్రలో గాయపడ్డ మాజీ మంత్రి గీతారెడ్డి

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర సాగుతోంది. ఈ పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి గీతారెడ్డి పాదయాత్రలో రాహుల్‌ కలిసి నడిచారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ నేత జె.గీతారెడ్డి భారత్ జోడో యాత్రలో గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించగా, ఆయన వెంట గీతారెడ్డి కూడా నడిచారు. ఆమె రోడ్డుపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాదయాత్రలో కలకలం రేగింది. కాగా, నిన్న కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. పాదయాత్రలో తోపులాట జరగ్గా, మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version