ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు లాక్ పడి ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడటంతో అందులో ఉన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు.

గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేసుకున్నారు నలుగురు చిన్నారులు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8) చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు.