వాలంటీర్లు లేకుండానే జీతాలు నోక్కేసాడు

-

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొందరు మాత్రం మోసాలు చాలా తెలివిగా చేస్తూ ఉంటారు అనే విషయం ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఉద్యోగాలు చేసే వారిలో కొందరు చాలా తెలివిగా మోసం చేస్తూ ఉంటారు. తాజాగా పశ్చిమ గొదావరి జిల్లా భీమవరంలో ఒక ఘటన జరిగింది. భీమవరం మున్సిపాలిటీలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ జిమ్మిక్కులు బయటకు వచ్చాయి.

డబ్బు

అధికారులను బురిడీ కొట్టించిన ఒక కంప్యూటర్ ఆపరేటర్.. జీతాల విషయంలో మోసం చేసాడు. గత కొన్ని నెలలుగా లేని వాలంటీర్ల పేరుతో జీతాలు స్వాహా చేసాడు కంప్యూటర్ ఆపరేటర్. లేని వాలంటీర్లకు వేతనాలు, ఉత్తమ సేవలకు నగదు పురస్కారాలు అందించారు మునిసిపల్ అధికారులు. దీనితో విచారణకు భీమవరం కమిషనర్ ఎం. శ్యామల ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version