భారతీయులుగా సిగ్గుపడాలి… : గౌతమ్ గంభీర్

-

గత రెండు రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘటన గురించి దేశమంతా చర్చిస్తున్నారు. వాస్తవంగా అది ఇప్పుడు జరిగిన ఘటన కాకపోయినా వీడియో వైరల్ కావడంతో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.. వెంటనే డిలీట్ చేయాలనీ అన్ని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. కాగా ఈ ఘటనను చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు, ఇప్పుడు ఇదే అంశంపై బీజేపీ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు. గంభీర్ మాట్లాడుతూ… మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదని, భారతదేశం లోని ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాలని గంభీర్ అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ విషయాన్ని రాజకీయం చేయద్దని విన్నవించారు.

 

ఇంకా మన దేశంలో ఏ ఒక్క అమ్మాయి కి ఇలా జరగకుండా చూసుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు గంభీర్. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని గంభీర్ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version