UIDAI కొత్త రూల్‌: 18 ఏళ్లు నిండిన వారు ఆధార్‌ కార్డు పొందటం అంత సులభం కాదు

-

బంగ్లాదేశ్ మరియు మయన్మార్‌తో సహా అనేక సరిహద్దు ప్రాంతాల నుండి చాలా మంది అక్రమంగా భారతదేశంలోకి చొరబడి మొదట ఆధార్ కార్డును పొందుతున్నారు. ఆధార్ కార్డు అందరికీ సులభంగా అందుబాటులో ఉండేది. ఇండియాలో చాలా ముఖ్యమైన పనులుకు ఆధార్‌ తప్పనిసరి అయింది.
సరిహద్దు ప్రాంతాల నుంచి ఇలా ఆధార్‌ కార్డు తీసుకుని చట్టవ్యతిరేక పనులుకు పాల్పడుతున్నారు..దేశ భద్రత సవాల్‌గా మారుతున్న తరుణంలో ఆధార్ కార్డులో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. UIDAI ఇప్పుడు ఆధార్ కార్డు పొందడానికి కొత్త మరియు కఠినమైన నిబంధనలను అమలు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారు కొత్త ఆధార్ కార్డు పొందడం అంత సులభం కాదు.

కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు పొందేందుకు పాస్‌పోర్టు తరహా వెరిఫికేషన్‌ను చేపట్టనున్నారు. అధికారులు వచ్చి మీరు ఆధార్ కార్డు కోసం ఇచ్చిన చిరునామాను వెరిఫై చేస్తారు. పాస్‌పోర్ట్ పొందే ముందు మీ చిరునామాను పోలీసు ధృవీకరణ చేయబడుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు పొందేందుకు నోడల్ అధికారులు చిరునామా ధృవీకరణ చేస్తారు.

UIDAI ఇప్పుడు ప్రతి జిల్లా, తాలూకా కేంద్రానికి నోడల్ అధికారులను నియమిస్తుంది. ఈ అధికారుల బృందం ఆధార్ కార్డు చిరునామాను తనిఖీ చేస్తుంది. చిరునామా, వయస్సుతో సహా అన్ని పత్రాలు ధృవీకరించబడతాయి. UIDAI పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కనీసం 180 రోజులు పడుతుంది.

2010లో ఆధార్ నమోదు ప్రారంభమైంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ చిరునామా, 10 సంవత్సరాల కంటే పాత ఫోటోతో సహా కొన్ని పత్రాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఆధార్ అప్‌డేట్ తేదీ గడువు మార్చి 24, 2024 వరకు పొడిగించారు. UIDAI ఆధార్ కార్డ్ డేటాను తనిఖీ చేసి, అప్‌డేట్ చేయాలని అభ్యర్థించింది. ఇప్పటికే పలుమార్లు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాడనికి గడువు ఇస్తూ వచ్చారు. ఇక మార్చి 24తో ఈ గడువు ముగియనుంది. ఆధార్‌ అప్‌డేట్‌ చేసి పదేళ్లు దాటిన వాళ్లు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news