గాంధీ ఆస్పత్రి రేప్ కేసు అప్డేట్..రంగంలోకి 10 బృందాలు..!

-

గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ఇంకా మిస్టరీ వీడలేదు. గతంలో ఇద్దరు బాధితులు ఉండగా వారిలో ఓ బాధితురాలు ఆచూకీ ఇంకా లభ్యం అవ్వలేదు. కాగా సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించిన పోలీసులు గాంధీ నుండి ఈ నెల 11న మధ్యాహ్నం బాధితురాలు బయటికి వెళ్ళినట్టు గుర్తించారు. బాధితురాలు తిరుపతమ్మ గాంధీ నుండి ముషీరాబాద్ వైపు కాలినడకన వెళ్ళినట్టు గుర్తించారు. దాంతో ముషీరాబాద్ పరిసరాల్లో పది బృందాలుగా ఏర్పడి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

rape attempt
rape attempt

తిరుపతమ్మ ఆచూకీ లభ్యం అయితేనే ఈ కేసులో అసలు నిజాలు తేలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలీసులు మొత్తం 60 మంది సాక్షులను విచారించారు. అంతే కాకుండా మరో సారి గాంధీ ఆస్పత్రిలో అణువణువు గాలిస్తున్నారు. మరోవైపు అన్ని పోలీస్ స్టేషన్ లకు తిరుపతమ్మ ఫోటోలను పంపించారు. ఈ కేసును నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న గాంధీ ఉద్యోగులను మరోసారి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news