శిల్పా లేఔట్ రెండో దశ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్

-

శేరిలింగం పల్లి జోన్ మల్కం చెరువు, గచ్చిబౌలి నుండి కొండాపూర్ వరకు చేపట్టిన రెండో దశ శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ శనివారం ఉదయం పరిశీలించారు. హెచ్ సిటి ప్రాజెక్ట్ ద్వారా ఖజాగూడ చౌరస్తా వద్ద చేపట్టనున్న ఫ్లై ఓవర్ అండర్ పాస్ స్తల పరిశీలించారు. మల్కం చెరువులో శానిటేషన్, కుక్కల బెడదపై కమిషనర్‌కు వాకర్స్ ఫిర్యాదు చేశారు.

వాకర్స్ ఇబ్బంది లేకుండా నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.చెరువు లో స్టార్మ్ డ్రైన్ వాటర్ ఎక్కడ నుండి వస్తుందని అధికారులను అడిగిన తెలుసుకున్నారు.దుర్గం చెరువు నుండి, ఇళ్లనుండి స్టార్మ్ వాటర్ వస్తున్నట్లు కమిషనర్ కు అధికారులు వివరించారు.

స్టార్మ్ వాటర్ చెరువులో రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శిల్పా లే ఔట్ రెండో దశ ఫ్లై ఓవర్ పనులను ఈ నెల చివరికి పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు.భూసేకరణ పూర్తిచేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని కమిషనర్‌కు ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. భూసేకరణ పక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆర్ వీ కర్ణన్ ఆదేశించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావు, డీసీ ప్రశాంతి, యస్ ఈ బాలాజీ, ప్రాజెక్టు ఈ ఈ
నమ్యనాయకి, డీఈఈ హరీష్, యుబీడీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news