ప్రేమ పేరుతో సోషల్ మీడియాలో పిక్స్… సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

-

మేడిపల్లిలో శ్వేత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడు వంచించనట్టు చెబుతున్నారు. ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలను ప్రియుడు అజయ్ సోషల్ మీడియాలో పెట్టాడు. వ్యక్తిగతంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టడంరో పాటు, అలా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు తీసేందుకు అజయ్ బ్లాక్ మెయిల్ చేశాడు.

ఫోటోలు తీయకుండా శ్వేతను వేధింపులకు అజయ్ గురి చేశాడు. వివాహం చేసుకుంటానని చెప్పి అజయ్ వేధింపులకు పాల్పడినట్టు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రైవేట్ ఫోటోలు పెట్టడంతో పరువు పోయిందని అవమానానికి గురైన శ్వేత, అజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా మారని అజయ్ ప్రవర్తనతో విసిగిపోయిన శ్వేత అజయ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ట్రైన్ కు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది ఆమె.

Read more RELATED
Recommended to you

Exit mobile version