బాలిక ప్రైవేట్ భాగాలపై అగరు బత్తులతో వాతలు..భూత వైద్యుడి ఘాతుకం !

-

బాలికకు దెయ్యం పట్టిందని ఆగరు బత్తులతో కాల్చతూ.. చిత్ర హింసలు పెట్టాడు ఓ భూమ వైద్యుడు. ఆ దారుణమైన సంఘటన ఏపీలో తాండురు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తాండూరుకు చెందిన రాజేష్‌ – సుజాత అనే దంపతులకు చిన్ని అనే కూతురు ఉంది. హోలి పండుగ రోజున చిన్ని అనారోగ్యం బారీన పడింది.

దీంతో చిన్ని ఎండీ వాహిద్‌ అనే మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. బాలికకు దెయ్యం పట్టిందని అతడు చెప్పాడు. దీంతో భయపడిన వారు బాలికను అతడి వద్దకు తీసుకెళ్లారు. భూతాన్ని పారద్రోలుతానని బాలికను కొట్టి, అగరు బత్తీలతో కాల్చి చిత్ర హింసలకు భూత వైద్యుడు పాల్పడ్డాడు.

బాలిక పెదాలు, నడుం, ప్రైవేట్‌ భాగాలపై వాతలు పెట్టాడు. బాలిక శారీరకంగా.. తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. పాటు మానసిక ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఆమెనున ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేష్‌ – సుజాత. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version