ఓ వైపు పెళ్లి జరుగుతుంటే.. బాలికను రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం..

-

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. కామాంధుల వెన్నులో మాత్రం వణుకుపుట్టడం లేదు. అన్యంపుణ్యం తెలియని చిన్నారులను సైతం వదలకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. నేటి సమాజంలో చిన్నపిల్లలను నుంచి పెద్ద వారి వరకు ఆడవాళ్ల బయటకు రావాలంటే భయపడుతున్నారు. అయితే.. తాజాగా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లో బందా పరిధిలోని ఒక బాలిక తన మేనమామ పెళ్లి ఈ నెల 23 న నిశ్చయమైంది. ఈ క్రమంలో బాలిక పెళ్లి వేడుకకు హజరైంది. ఉల్లాసంగా పాల్గొంది.

అయితే, ఆమె సమీప బంధువు బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. బాలికను గదిలోనికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆతర్వాత.. ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడిపోయింది. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఏమైందని నిలదీశారు. ఈ క్రమంలో బాలిక జరిగిన దారుణాన్ని తెలిపింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత నుంచి నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version