బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. అదే బాట‌లో వెండి..

-

నిన్న‌ భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా దేశీయ మార్కెట్లలో భారీగా పెరుగుద‌ల న‌మోదు చేసింది. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయలు పెరిగి 39,770 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయలు పెరిగి 36,460 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 300 రూపాయలు పెరిగి 46,650 రూపాయలకు ఎగబాకింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పై చూపులు చూశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగింది. దీంతో 38,400 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయలు పెరగడంతో 37,200 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర మాత్రం కేజీకి 300 రూపాయలు పెరిగి 46,650 రూపాయల వద్దకు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news