బిగ్ బ్రేకింగ్‌: పైపైకి క‌దిలిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్ని దిగొచ్చిన బంగారం ధ‌ర ఈ రోజు షాకిస్తూ పైపైకి క‌దిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం పెరిగింది. రూ.160 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.41,670 నుంచి రూ.41,830కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదలతో రూ.38,200 నుంచి రూ.38,360కు ఎగసింది. బంగారం ధర పెరిగితే కేజీ వెండి ధర కూడా పైకి కదిలింది. పసిడి బాటలోనే పయనించింది. కేజీ వెండి రూ.100 పెరుగుదలతో రూ.49,600కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,100 నుంచి రూ.39,200కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.40,300 నుంచి రూ.40,400కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. రూ.49,600కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news