బిగ్ బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

రెండు రోజుల నుంచి త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పైకెగ‌సాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 450 రూపాయలు పెరిగింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,330 గావుంది.. శుక్రవారం 41,880 రూపాయలకు నుంచి పెరిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 350 రూపాయలు పెరగడంతో 38,380 నుంచి 38,730 రూపాయల వద్దకు చేరుకుంది. ఒకవైపు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా, వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి ధరలు కేజీకి 500 పెరిగింది. దీంతో వెండి ధరలు కేజీకి 48,500 రూపాయల వద్దనిలిచాయి.

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 300 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,700 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,500 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 48,500 రూపాయలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news