బ్రేకింగ్‌: ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌.. వెండి కూడా పైపైకే..!

-

ప‌సిడి ధ‌ర ప‌రుగులు పెడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పైకి కదిలింది. దీంతో ధర రూ.38,730 నుంచి రూ.38,980కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. రూ.190 పెరిగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,330 నుంచి రూ.42,520కు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.500 పెరుగుదలతో రూ.49,000కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగానే ఉంది. రూ.40,700 వద్దనే కొనసాగుతోంది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.39,500 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర స్థిరంగా నిలిచింది. దీంతో కేజీ వెండి ధర రూ.49,000 వద్ద కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version