పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా

-

గత మూడు వారాలుగా భారీగా క్షీణిస్తూ వచ్చిన బంగారం ధర భారీగా పెరిగింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ‌‌లలో బంగారం ధర  220 రూపాయలు పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,290కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹46,100 అయింది.

 

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 పెరగడంతో కేజీ ధర రూ.67,500కి పుంజుకుంది. ఢిల్లీ మార్కెట్‌‌లో గత రెండు వారాలుగా తగ్గిన బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. నేటి మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,330కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,060కి ఎగసింది.  

Read more RELATED
Recommended to you

Exit mobile version