ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఫీజు చెల్లింపు పై కీలక ప్రకటన

-

ఏపీ పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదవ తరగతి పరీక్షల ఫీజు గడువు పై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీ 10వ తరగతి పరీక్షల ఫీజు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షలు విభాగం సంచాలకుడు దేవానందా రెడ్డి ప్రకటన చేశారు.

50 రూపాయల ఫైన్ తో ఈనెల 26వ తేదీ వరకు అలాగే 200 రూపాయల ఫైన్ తో జనవరి రెండవ తేదీ వరకు గడువును పొడిగించింది. అంతేకాదు 500 రూపాయల ఫైన్ తో జనవరి 9వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. కాగా మార్చి లేదా ఏప్రిల్ మాసంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version