ఉక్రెయిన్ నుండి వచ్చిన తెలంగాణ విద్యార్థులు శుభవార్త.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఫ్రీగా ప్రయాణం

-

ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.

ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తో కూడిన ప్రత్యేక విమానం ఇప్పటికే ముంబై చేరుకు oదని… మరో ఫ్లైట్ అర్ధరాత్రి రెండు గంటలకు న్యూఢిల్లీ పి చేరుకుందని సోమేష్ కుమార్ తెలిపారు. అయితే.. విద్యార్థులు హైదరాబాద్ కు చేరడానికి ప్రభుత్వం ఉచితంగా టికెట్లను అందించడానికి ఏర్పాటు చేసిందని తెలిపారు.

విద్యార్థులు ప్రత్యేక ఫ్లైట్ ద్వారా ఆదివారం ఉదయం బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారని వివరించారు. క్రేన్ నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను న్యూఢిల్లీ అలాగే హైదరాబాద్ లో చేయడం జరిగిందని వివరించారు. వారి కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సీఎస్ సోమేష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version