తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..దర్శన టికెట్ల పెంపు

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. దర్శన టికెట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. కోవిడ్ మహమ్మారి తగ్గు ముఖం పడుతు వుండడంతో దర్శన టిక్కేట్లు పెంపునకు టిటిడి పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం భక్తులకు 20 వేల టోకేన్లు జారి చేస్తూ నిర్నయం తీసుకుంది టిటిడి.

ttd

ఇక ఈ నెల 24 వ తేది నుంచి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లు కోటాను 25 వేలకు పెంచనుంది టిటిడి పాలక మండలి. ఇక రేపు ఉదయం 9 గంటలకు పిభ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 31వ తేదికి సంభందించిన టోకేన్లు ఆన్ లైన్ లో విడుదల చేయ్యనుంది టిటిడి. టీటీడీ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇక శ్రీవారి దర్శనం సులభ తరం కానున్నట్లు చెబుతున్నారు భక్తులు.

Read more RELATED
Recommended to you

Latest news