నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ గుడ్ న్యూస్..స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు

-

అమరావతి : టూరిజం శాఖపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో రెండు శాతం మేర స్పోర్ట్స్ కోటాకు రిజర్వేషన్ ఉందని… ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా సిద్దం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని…రాయల సీమ, కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సర్క్యూట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

మూడు సర్క్యూట్లల్లో ఒబెరాయ్ హోటళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని… ఫారెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం వంటి వాటిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో టూరిజం ఫెస్టివల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆయన.. కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం లేకుంటే ప్రతి జిల్లాలోనూ క్రీడా పోటీల నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news