బ్రేకులు ఫెయిలై బోల్తా పడిన గూడ్స్ రైలు.. చెల్లాచెదురైన 53 కోచ్​లు

-

బిహార్​లోని గయా ప్రాంతంలో ఓ రైలు ప్రమాదానికి గురైంది. ఇవాళ ఉదయం గయాలో ఓ గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. ఉదయం గయాలోని హజారీబాగ్ నుంచి దాద్​రీకి బొగ్గుతో వెళ్తున్న రైలు.. పట్టాలు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. కానీ 58 కోచ్​లలో 53 కోచ్​లు చెల్లాచెదురయ్యాయని వెల్లడించారు. రైల్వే సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. బ్రేక్​ ఫెయిల్​ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version