పైకప్పు పెచ్చులు పడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి తీవ్రగాయాలు

-

ప్రభుత్వ పాఠశాలలోని పైకప్పు పెచ్చులు మీద పడటంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటన వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం మున్నూరు సోమారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఒకటో తరగతి చదువుతున్న శిరీషపై (6 సంవత్సరాలు) పాఠశాల పైకప్పు పెచ్చులు పడటంతో అమ్మాయి తల, చెవికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన ఆ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయిని మా శారద హాస్పిటల్ వికారాబాద్‌కు తరలించారు. డాక్టర్ రాజశేఖర్ ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news