Telangana : రేపే శాసనసభ సమావేశాలు.. రెండేళ్ల తర్వాత గవర్నర్ ప్రసంగం

-

రెండేళ్ల అనంతరం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఉభయసభల సంయుక్త సమావేశంతో రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమావేశాల కోసం ఇప్పటికే సన్నాహకాలు పూర్తి చేశారు.

కొత్త సమావేశం కానందున.. గత ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేదు. దీనిపై రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రేగింది. ప్రస్తుతం కూడా గత సమావేశాలను కొనసాగిస్తూ గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేదని మొదట తెలిపారు. అయితే.. తన ప్రసంగం లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మొదట అనుమతి ఇవ్వలేదు.

కొత్త సమావేశం కానందున.. గత ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేదు. దీనిపై రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రేగింది. ప్రస్తుతం కూడా గత సమావేశాలను కొనసాగిస్తూ గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేదని మొదట తెలిపారు. అయితే.. తన ప్రసంగం లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మొదట అనుమతి ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version