గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్

-

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను TGPSC విడుదల చేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించారు.అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ :

అక్టోబ‌ర్ 21 – జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్), అక్టోబ‌ర్ 22 – పేప‌ర్ 1(జ‌న‌ర‌ల్ ఎస్సే), అక్టోబ‌ర్ 23 – పేప‌ర్ 2(హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ), అక్టోబ‌ర్ 24 – పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌), అక్టోబ‌ర్ 25 – పేప‌ర్ 4(ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్), అక్టోబ‌ర్ 26 – పేప‌ర్ 5(సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్), అక్టోబ‌ర్ 27 – పేప‌ర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్) నిర్వహించనున్నట్లు షెడ్యూల్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news