BREAKING : యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు

-

యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని కావూరి హిల్స్‌లోని కార్యాలయంలో జీఎస్టీ నిఘా విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సంస్థ ఆదాయం, చెల్లిస్తున్న జీఎస్టీకి తేడా ఉండడాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రూ.6 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. లోతైన పరిశీలన కోసం సంస్థ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version