సంక్రాంతి మామూళ్ళ కోసమే బాబుతో పవన్ భేటీ – మంత్రి గుడివాడ

-

చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్..కాసేపటి క్రితమే చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ సమావేశం అయ్యారు. అయితే, ఈ నేపథ్యంలోనే, చంద్రబాబు-పవన్ భేటీపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. సంచలన ట్వీట్‌ చేశారు. సంక్రాంతి మామూళ్ళ కోసమే బాబుతో పవన్ భేటీ అయ్యారంటూ చురకలు అంటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్త పుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ వెళ్లాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ్టీ భేటీతో చంద్రబాబు-పవన్ ముసుగు తొలగిపోయిందని.. ఏపీని వదిలేసి పక్క రాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1 పై చర్చించడమేంటి..? అని నిలదీశారు. జీవో నెంబర్-1 పై చర్చించడానికి హైదరాబాదులో సమావేశం అయ్యామనడం హాస్యాస్పదమని..పవనుకు ఒక స్టాండ్ లేదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version