Guntur karam:మహేష్ బాబు కూతురు మంచి మనసు…. అనాథల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ షో

-

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే…ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార అనాథ పిల్ల‌ల కోసం ‘గుంటూరుకారం’ సినిమా స్పెష‌ల్ షో ఏర్పాటు చేసి మరోసారి తన మనసు చాటుకుంది.

మహేశ్‌బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏఎంబీ సినిమాస్ వేదిక‌గా ఈ సినిమా స్పెష‌ల్ షో ఏర్పాటు చేశారు.చిన్నారుల‌తో క‌లిసి గుంటూరు కారం మూవీ చూశారు. అనంత‌రం వారితో క‌లిసి ఫొటోలు దిగారు. ఇక ఇది చూసిన నెటిజ‌న్లు సోషల్ మీడియాలోమ‌హేష్ లాగానే సితార కూడా బంగ‌రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీ లీల మీనాక్షి చౌదరీలు కథానాయికలుగా నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ మహేష్ బాబు కి తల్లిగా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version