అజారుద్ధీన్ దేశ ద్రోహి ; HCA సెక్రటరీ సంచలనం

-

అజారుద్దీన్ దేశ ద్రోహి అని…హెచ్‌సీఏ లో ఆయన చేసిన అక్రమాలను బయట పెట్టాలని..హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు అజారుద్దీన్ మా పై నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారని… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న అవకతవకల పై ప్రశ్నించిందకు మాపై పరువు నష్ట దావా కేసు వేసాడని నిప్పులు చెరిగారు..

అజరుద్దీన్ రెండు కోట్లకు మాపై సివిల్ సూట్ కేసు వేసాడని… ఫేస్ బుక్ లో ఆరోపణలు చేసినందుకే మాపై పరువు నష్ట దావా కేసు వేసాడని తెలిపారు. అజరుద్దీన్ పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్ళీ రీ ఓపెన్ చెయ్యాలని..సీబీఐ చేత అజరుద్దీన్ కేసు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సివిల్ సూట్ లో వేసిన పిటీషన్ ను మేము కౌంటర్ వేసామని.. మేము వేసిన కౌంటర్ కు ఇప్పటి వరకు అజరుద్దీన్ నుంచి సమాధానం లేదని మండిపడ్డారు..హెచ్‌సీఏ లో వాళ్లకు మధ్య వర్గ పోరు జరుగుతుందన్నారు. బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను hca అధ్యక్షుడు గా చెప్పుకుంటున్న అజరుద్దీన్ అమలు చెయ్యడం లేదన్నారు. బిసిసిఐ ఇచ్చిన గైడ్ లెన్స్ ను అమలు చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news