భువనగిరి ఎంపీ బరిలోకి పోటీ కి రెడీ: గుత్తా

-

మండలంలో నమాజ్ పల్లి గ్రామంలో పూర్ణగిరి కొండమీద శ్రీ సుదర్శన్ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొన్నారు స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు తీర్థప్రసాదాలు ఆశీర్వాదాలు తీసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. భువనగిరి ప్రాంత ప్రజలతో నాకు విడతీయులైన మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. గతంలో నేను మదర్ డైరీ చైర్మన్ గా ఎంపీగా భువనగిరి ప్రజలకి సేవలు అందించాలని ఆయన చెప్పారు.

ఇప్పటిదాకా భువనగిరి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని అధిష్టానం ఆదేశిస్తేనే భువనగిరి పార్లమెంట్ బరిలో ఎంపీగా కొడుకు అమిత్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అధిష్టానంతో ఎంపీ టికెట్ విషయంపై చర్చించబోతున్నట్లు చెప్పారు బోనగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేసే అవకాశం నా కొడుకు అమిత్ రెడ్డికి కన్ఫర్మ్ అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు భువనగిరి ఎంపీగా పోటీ చేసే విషయంలో అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయం అని అన్నారు అయితే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటుగా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news