Gutta Jwala: హిజాబ్ పై గుత్తా జ్వాల సంచలన ట్వీట్..మీ రాజకీయాలు ఆపండి!

-

కర్ణాటకలో మొదలైన ‘హిజాబ్’ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని మరో వర్గం విద్యార్థులు అభ్యంతరం చెప్పడం.. వారు కాషాయ కండువాలు ధరించి విద్యాలయాలకు రావడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హిజాబ్ పై గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేశారు.

బాలికలను స్కూల్ గేట్ల వద్ద అవమానించడం మానేయండంటూ ఓ రేంజ్‌ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారని గుర్తు చేశారు… స్కూల్ వారి సురక్షిత స్వర్గమని.. నీచ రాజకీయాల నుండి వారిని తప్పించండని డిమాండ్‌ చేశారు గుత్తా జ్వాల.

చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గుత్తా జ్వాల. దీనిపై కోర్టులు అత్యంత త్వరగా స్పందించాలని కోరారు. కాగా.. హిజాబ్ వివాదం పై ఇవాళ కర్నాటక హై కోర్టు విచారణ జరుగనుంది. ఇవాళ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version