ఏపీలో సంచలన మార్పులు తీసుకువస్తాం.. వైసీపీకి చరమ గీతం పాడండి : GVL

-

ఏపీలో సంచలన మార్పులు తీసుకువస్తాం.. వైసీపీకి చరమ గీతం పాడండి అని ప్రజలను కోరారు రాజ్యసభ సభ్యులు జీ వీ ఎల్. నరశింహరావు. బడుగు, బలహీన వర్గాలు కు చెందిన వ్యక్తి ని బిజెపి నిలిపి న మా చిత్తశుద్ధి అర్థం అవుతుందని పేర్కొన్నారు జీవీఎల్‌. ఒకే కుటుంబం రాజ్యమేలుతున్నారని.. మూడేళ్ళ పరిపాలన లో రైతులకు అన్యాయం చేసిందని నిప్పులు చెరిగారు.

ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నగదు చెల్లించలేదని.. వైసీపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగే ఎన్నిక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉందని.. అందరూ బిజెపి ని గెలిపించండన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకోస్తామని చెప్పారు. ఆత్మకూరు అభివృద్ధి కి నోచుకోలేదు.. ఇక్కడ రోడ్లు గుంతలు చూడలేక మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారన్నారు. మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో తిరుగుతున్నారని.. గ్రామాల్లో అభివృద్ధి కి రూ. 500 కోట్లు కేంద్రం ఇచ్చింది.. కనీసం రోడ్లు వేయలేదని విమర్శించారు GVL.

Read more RELATED
Recommended to you

Exit mobile version