హరీష్ రావు ప్రజలకు కీలక పిలుపు..!

-

దేశాన్ని పదేళ్లు పాలించిన బిజెపి ప్రజలకు ఏం చేసింది అని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సోమవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే బిజెపి ఎంపి అభ్యర్థులని ప్రశ్నించాలని హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం సామాన్యులు భరించలేని విధంగా నిత్యవసర వస్తువు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు.

ఆకలి నిరుద్యోగం పేదరికం అన్ని పెరిగిపోయాయి అని అన్నారు. జిఎస్టి వేసి ధరలు పెంచిందని తెలిపారు పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదని చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్ని బిజెపి ప్రభుత్వం నిండా ముంచేస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి పథకాలే లేవని అన్నారు పదేళ్లలో బిజెపి తెలంగాణకి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version