ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు మునుగోడుకు వస్తున్నారు : హరీశ్ రావు

-

బీజేపీ నాయకులపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హామీలు నెరవేర్చలేని బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మునుగోడుకు వస్తున్నారని ప్రశ్నించారు. వారి అబద్ధపు హామీలను ప్రజలు గమనించారని.. ఈ ఉపఎన్నికలో తప్పక కాషాయ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

2016లో మర్రిగూడెం పర్యటన సందర్భంగా నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు. ‘మీ హామీలు ఏమయ్యాయి జేపీ నడ్డా గారు..?. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మీరు హమీ ఇచ్చి ఆరేళ్లయింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్‌లో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదు. మర్రిగూడలో 300 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని కూడా హమీ ఇచ్చారు. అబద్ధపు హామీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి మునుగోడుకు వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం.’ అని మంత్రి హరీశ్‌ రావు ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version