YS షర్మిల ఎక్కడ అడుగుపెడితే అక్కడ దరిద్రమే – హరీశ్ రావు

-

YS షర్మిల పాదయాత్ర పై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిల ఎక్కడ అడుగుపెడితే అక్కడ దరిద్రమే అంటూ ఓ రేంజ్ లో హరీశ్ రావు చురకలు అంటించారు. ఆనాడు తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్ట, బీడినా అన్నారని.. వాళ్ళ పిల్లలు వచ్చి ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారని షర్మిలను ఏకిపారేశారు హరీష్ రావు.

కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. మీరు వచ్చి ఇక్కడ తిరుగుతామంటే అంతకంటే దరిద్రం ఉండదు..ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.

తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసిన ఘనత కొండ లక్ష్మణ్ బాపూజీదన్నారు. అంతలా పదవులు త్యాగం చేసింది మళ్ళీ కేసీఆర్ అని కొనియాడారు. కేంద్రంలో ఉండే బిజెపి ప్రభుత్వం కులవృత్తులకు ఏం చేసిందని ప్రశ్నించారు. పని చేసే వాళ్ళు ఎవరు.. ఉన్నది ఊడగొట్టింది ఎవరో ఆలోచించాలన్నారు మంత్రి హరీష్ రావు. పద్మశాలీల కోసం పటాన్చెరువులో మంచి భవనం నిర్మిస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version